మోదీకి పవన్ కల్యాణ్ మద్దతు

మోదీకి పవన్ కల్యాణ్ మద్దతు
x
Pawankalyan, PM Narendra Modi
Highlights

కరోనాపై నియంత్రణ నేపథ్యంలో మార్చి 20న జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.

కరోనా పై నియంత్రణ నేపథ్యంలో మార్చి 20న జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..తాజాగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 4న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ లైట్స్, వెలిగించాలని దేశప్రజలను కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. ఇళ్లల్లోనే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి చీకట్లను తరిమికొట్టాలని సూచించారు. ఈ క్రమంలో 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని చాటుదామని మోదీ పిలుపునిచ్చారు.

ఈ మోదీ తల పెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ట్విటర్ ద్వారా మద్దతు తెలిపారు. మోదీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే ట్విటర్‌లో 9baje9minute (9 గంటలకు 9 నిమిషాలు) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇలా ప్రధాని మూఢనమ్మకాలను నమ్ముకోవడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. మోదీ లైట్‌ప్ ఇండియా కాన్సెప్ట్‌లో క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర సిద్ధాంతం సైన్స్ దాగుందనే అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories