Pawan Kalyan Pithapuram Visit: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ వార్నింగ్.. కొబ్బరాకు పడినా వైసీపీ వారు ఏడుస్తున్నారు!

Pawan Kalyan Pithapuram Visit: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ వార్నింగ్.. కొబ్బరాకు పడినా వైసీపీ వారు ఏడుస్తున్నారు!
x
Highlights

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. వైసీపీపై పవర్‌ఫుల్ విమర్శలు చేస్తూనే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 188 కోట్ల పనులకు శంకుస్థాపన. పూర్తి వివరాలు ఇక్కడ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం'లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

రూ. 188 కోట్లతో అభివృద్ధి బాట!

పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 188 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 300 కోట్లతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.

వైసీపీపై పవన్ కళ్యాణ్ 'పవర్' పంచ్‌లు:

సంక్రాంతి ఉత్సవాల వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అతి ప్రచారం: "పిఠాపురంలో కొబ్బరాకు పడినా, పక్షి ఈక రాలినా ఏదో దారుణం జరిగిపోయిందని వైసీపీ వారు సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు. లేనిపోని విష ప్రచారాలు చేస్తున్నారు."

నా నియోజకవర్గంలో మీకేం పని?: "నేను వేరే నియోజకవర్గాలకు వెళ్లకూడదట.. కానీ వాళ్లు మాత్రం నా నియోజకవర్గానికి వచ్చి కెలుకుతారు. దేశం కోసం పని చేసే వాడిని.. పండుగలకు రాలేదని నన్ను విమర్శిస్తారా?" అని మండిపడ్డారు.

రాజకీయాలంటే బాధ్యత: "నేను పెద్ద నటుడిని, సినిమాల్లో కోట్లు సంపాదించే అవకాశం ఉంది. సినిమా ఫ్లాప్ అయినా నాకు డబ్బులు వస్తాయి. కానీ నేను వచ్చింది డబ్బు కోసం కాదు, ప్రజల పట్ల బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాను."

జూదాలు వద్దు.. సంస్కృతి ముద్దు!

సంక్రాంతి పండుగ జరుపుకునే విధానంపై పవన్ కళ్యాణ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

సంక్రాంతి అంటే కోడిపందేలు, పేకాట, కోట్లు చేతులు మారడం మాత్రమే కాదని ఆయన అన్నారు.

జూదాలను భోగి మంటల్లో కలిపేసి, మన సంస్కృతి ఉట్టిపడేలా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సోదరులను ఆహ్వానించి, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని, ప్రేమను వారికి పంచాలని కోరారు.

కళాకారులతో కలిసి చిందులు!

ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పవన్‌ను ఆకట్టుకున్నాయి. గిరిజన నృత్యాలు, తోలుబొమ్మలాట కళాకారులను ఆయన అభినందించారు. స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి అక్కడున్న వారందరినీ ఉత్సాహపరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories