పవన్ లాంగ్ మార్చ్ కి టిడిపి నేతలు

పవన్ లాంగ్ మార్చ్ కి టిడిపి నేతలు
x
Highlights

ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ పేరుతో విశాఖ నగరంలో పవన్ కళ్యాణ్ ఒక ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు...

ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ పేరుతో విశాఖ నగరంలో పవన్ కళ్యాణ్ ఒక ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాంగ్ మార్చ్ లో ముగ్గురు టీడీపీ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు ఈ ర్యాలీలో పాల్గొంటారని , ఆ మేరకు పార్టీ నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే లాంగ్ మార్చ్‌లో పాల్గొనబోమని బీజేపీ, వామపక్షాలు వెల్లడించాయి. కాగా లాంగ్‌ మార్చ్‌... రామాటాకీస్‌, ఆశిల్‌ మెట్ట జంక్షన్‌ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ తీయనున్నారు. ఇదిలావుంటే తెలుగుదేశం, జనసేనలు మళ్లీ కలిసి రాజకీయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంటున్నారన్నవాదన ఈ పరిణామంతో మరింత బలపడినట్టైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories