Pawan Kalyan: ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు వేచి చూద్దాం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు వేచి చూద్దాం: పవన్ కళ్యాణ్
x
పవన్ కళ్యాణ్
Highlights

అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని.. ఎవరికీ అన్యాయం జరగకూడదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.

అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని.. ఎవరికీ అన్యాయం జరగకూడదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇటీవల జనసేన నాయకులు రాజధాని గ్రామాల పర్యటనపై ఒక నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్, ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, పార్టీ నేతలందరికీ ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. జిల్లా వారీగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్టీ నాయకులకు సూచించారు.

సుదీర్ఘ విరామం తరువాత, పవన్ మూడు రాజధానులపై తన తాజా వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చాడు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే స్పందించాలని పార్టీ నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అప్పటిదాకా ఎవరూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించారు. కాగా మొదట్లో రాజధాని తరలింపుపై పవన్ కళ్యాణ్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం నిర్ణయం వచ్చేంత వరకు ఏమి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories