వైసీపీ ప్రభుత్వం, నేతలపై జనసేనాని ఫైర్

admin
Published on: 28 Dec 2020 1:48 PM IST
వైసీపీ ప్రభుత్వం, నేతలపై జనసేనాని ఫైర్
X

కృష్ణాజిల్లా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌.. వైసీపీ ప్రభుత్వం, నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఉన్న శ్రద్ధ.. రోడ్లు బాగుచేయడంపై ఉంటే బాగుంటుందని విమర్శించారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే కుదరదని.. నోటి దురుసుగా మాట్లాడే వైసీపీ నేతలను జనసేన ఎదుర్కొంటుందని అన్నారు. వైసీపీ నేతలు తమ తమ బిజినెస్‌లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు కానీ.. నేను సినిమాలు చేస్తూ.. పాలిటిక్స్‌ చేస్తే తప్పా అంటూ ప్రశ్నించారు పవన్. నివర్ తుపాను బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని అన్నారు జనసేనాని.

admin

admin

Next Story