Breaking: హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్

Breaking:  హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అంతేకాదు అమరావతి పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో అమరావతి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. అమరావతి ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు పవన్.

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయి.. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్టు సమాచారం. కాగా అమరావతి గ్రామాల రైతులతో నిన్న పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. తుళ్లూరు, మందడం, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు తదితర గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు తమ గ్రామాల్లో పరిస్థితులు పవన్‌ కళ్యాణ్‌ కు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories