ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి : పవన్ కల్యాణ్

ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి : పవన్ కల్యాణ్
x
Highlights

కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిపై దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు...

కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిపై దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం ట్వీట్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపై దాడులు చేయడం హేయమన్నారు.

ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. వైద్యులకు మద్దతుగా నిలవాలని జనసేన నేతలు, కార్యకర్తలకు పవన్‌ పిలుపునిచ్చారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డాక్టర్లపై చోటుచేసుకుంటున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, లేకపోతే ఏప్రిల్ 23వ తేదీని బ్లాక్ డేగా ప్రకటిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories