కూతురు కులాంతర వివాహం చేసుకుందని కాల్చి బూడిద చేశారు..

కూతురు కులాంతర వివాహం చేసుకుందని కాల్చి బూడిద చేశారు..
x
Highlights

కూతురు కులాంతర వివాహం చేసుకుందని కాల్చి బూడిద చేశారు.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని కాల్చి బూడిద చేశారు..

కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో కన్నకూతురును దారుణంగా హతమార్చారు తల్లిదండ్రులు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. శాంతిపురం మండలం రెడ్లపల్లిలో బీసీ కులానికి చెందిన చందన, వడ్డుమడి గ్రామానికి చెందిన ఎస్సి కులానికి చెందిన నందకుమార్ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దాంతో 2 రోజుల క్రితం వీరు రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు.. అయితే మొదట ఈ పెళ్లిని అంగీకరించినట్లు చెప్పిన చందన తల్లిదండ్రులు.. ఆమెను నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు.

శనివారం మధ్యాహ్నం చందనను ఇంటికి తీసుకెళ్లి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసిన తల్లిదండ్రులు.. బూడిద కూడా దొరక్కుండా మాయం చేశారు. అయితే చందన నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానం చెందిన నందకుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు విచారణ చేపట్టిన పోలీసులు...చందన ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల్ని ప్రశ్నించారు. అయితే చందన ఉరేసుకొని చనిపోయిందని.. అందుకే దహనసంస్కారాలు పూర్తిచేశామని చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా హత్య విషయం బయటపడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories