విశాఖ రాజధాని మద్దతుగా కరపత్రాలు పంపిణీ

విశాఖ రాజధాని మద్దతుగా కరపత్రాలు పంపిణీ
x
Highlights

కూడలిలో అభివృద్ధి వికేంద్రీకరణ చెందాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా వైయస్సార్ విద్యార్థి విభాగం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు బి.కాంతారావు ఆధ్వర్యంలో ప్రజలకు పువ్వులు, కరపత్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మద్దిలపాలెం: కూడలిలో అభివృద్ధి వికేంద్రీకరణ చెందాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా వైయస్సార్ విద్యార్థి విభాగం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు బి.కాంతారావు ఆధ్వర్యంలో ప్రజలకు పువ్వులు, కరపత్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖపట్నం అభివృద్ధి చెందాలి అని వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు.

అదే విధంగా ఈ రోజు చూస్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పిఏ కేవలం రెండు వేల కోట్లు అవినీతి చేస్తే చంద్రబాబునాయుడు ఏ స్థాయిలో అవినీతి చేశారో ఊహించడానికే అంతు చిక్కడం లేదని, ఖచ్చితంగా పెద్ద మాఫియా ఉంది. పోలీసులు విచారణ చేసి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories