AP News: మరోసారి తెరపైకి విశాఖ కోడి కత్తి కేసు.. సీఎం జగన్ విశాఖ కోర్టుకు హాజరు కావాలంటూ లాయర్ పిటిషన్

AP News: వీడియో కాల్ ద్వారా హాజరవుతారని పిటిషన్ వేసిన జగన్ తరపు లాయర్

Shekhar G
Published on: 29 Aug 2023 3:09 PM IST
Once Again Visakha Chicken Knife Case Came To The Fore
X

AP News: మరోసారి తెరపైకి విశాఖ కోడి కత్తి కేసు.. సీఎం జగన్ విశాఖ కోర్టుకు హాజరు కావాలంటూ లాయర్ పిటిషన్

AP News: కోడి కత్తి కేసు విచారణలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పనిసరిగా విశాఖ NIA కోర్టుకు హాజరై తమ సాక్ష్యం చెప్పాలని కొడికత్తి కేసు నిందితుడు శ్రీను తరపు లాయర్ సలీం పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు ఎదుట విచారణకు నిందితుడు శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా కేసును సెప్టెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో విశాఖ కోర్టుకు వీడియో కాల్ ద్వారా హాజరవుతానని సీఎం జగన్ తరపు న్యాయవాది కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి కోడి కత్తి కేసుపై చర్చ జరుగుతోంది.

Shekhar G

Shekhar G

Next Story