అన్నవరంలో దారుణం.. రిపోర్టర్ ను నరికి చంపారు..

అన్నవరంలో దారుణం.. రిపోర్టర్ ను నరికి చంపారు..
x
Highlights

అన్నవరంలో దారుణం.. రిపోర్టర్ ను నరికి చంపారు.. అన్నవరంలో దారుణం.. రిపోర్టర్ ను నరికి చంపారు..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఛానల్ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపారు. తొండంగి అర్బన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణను ప్రత్యర్ధులు మాటువేసి.. క్రూరంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

మరోవైపు విలేకరి హత్యపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. హత్య వివరాలపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడినట్టు సమాచారం. అతడి మృతితో తొండంగి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా సత్యనారాయణ హత్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. దీనిని ఆటవిక చర్యగా పేర్కొన్న పవన్.. భయపెడితే తప్ప కలానికి సంకెళ్లు వేయలేమనే ఉద్దేశంతోనే ఈ ఘాతూహుకానికి పాల్పడినట్టు అనిపిస్తోందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories