శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సూది కలకలం... దర్యాప్తునకు ఆదేశించిన చైర్మన్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సూది కలకలం... దర్యాప్తునకు ఆదేశించిన చైర్మన్
x
Highlights

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సూది రావడంతో కలకలం రేగింది. దేవగుడిపల్లికి చెందిన శశాంక్ అనే భక్తుడు శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సూది రావడంతో కలకలం రేగింది. దేవగుడిపల్లికి చెందిన శశాంక్ అనే భక్తుడు శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాడు.. నోట్లో వేసుకోవడంకోసం విరిచి చూడగా అందులో సూది ప్రత్యక్షమైంది. దీంతో వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వరకు చేరింది. ఫిర్యాదుపై స్పందించిన సుబ్బారెడ్డి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు... దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డిని ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories