నీ తండ్రి వల్లే కాలేదు.. జగన్‌పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

నీ తండ్రి వల్లే కాలేదు.. జగన్‌పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
x
లోకేశ్ ఫైల్ ఫోటో
Highlights

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణాలు, టెండర్లు సహా అన్నింటిపై దర్యాప్తుకు జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణాలు, టెండర్లు సహా అన్నింటిపై దర్యాప్తుకు జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఏర్పాటుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్ స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎన్నో విచారణలు జరిపారని ఏం సాధించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలుగా సబ్ కమిటీలు, సీఐడీ విచారణ, విజిలెన్స్‌లు వేసి చివరికి ఏం సాధించారని నిలదీశారు. ఈ సిట్ కూడా అంతే అని లోకేశ్ అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

లోకేశ్ తన ట్వీట్‌లో '''మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించారు. ఏమైంది? అని ప్రశ్నించారుగత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీ కి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది? అని మరో ట్వీట్ లో ప్రశ్నించారు. "ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు..అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతోనే ఇక్కడే అర్ధం అవుతుంది యువమేత ఆత్రం.. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందానికి పలు ప్రత్యేక అధికారాలు కల్పించింది. అయితే ఇదంతా రాజకీయ కక్షసాధింపులో భాగమని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories