ఇక ఉపేక్షించేది లేదు.. పోరాటం చేయబోతున్నాం : నారా లోకేష్

ఇక ఉపేక్షించేది లేదు.. పోరాటం చేయబోతున్నాం : నారా లోకేష్
x
Highlights

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్...

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారాయన.. అందులో..'శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.ఇప్పుడు టిడిపి కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారు. తిరుచానూరులో టిడిపి కార్యకర్త హేమంత్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను'

'ముఖ్యమంత్రి తన ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకుందామనే సరికొత్త పంధా ఎంచుకున్నారు.ఇకపై ఉపేక్షించేది లేదు అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నాం.' అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లోకేష్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories