వచ్చేది మా ప్రభుత్వమే: నాగబాబు జోస్యం

వచ్చేది మా ప్రభుత్వమే: నాగబాబు జోస్యం
x
Highlights

వచ్చేది మా ప్రభుత్వమే నని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. 2024 లో జనసేన,బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.

వచ్చేది మా ప్రభుత్వమే నని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. 2024 లో జనసేన,బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. పచ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు పర్యటించారు నాగబాబు. అనంతరం మీడియాతో మాట్లాడిన అయన అక్కడ రోడ్ల పరిస్థితి ఎం బాలేదని, రోడ్లపైన ప్రయాణం చేయడం కన్నా, హెలికాఫ్లర్లు కొనుక్కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

ఇక బీజేపీ, జనసేన కలయక రాష్ట్ర అభివృద్ధికి అవసరమని, వైసీపీ ఎప్పుడు ఏది రద్దు చేస్తుందో, ఎవరికీ అర్ధం కావడం లేదని అన్నారు. నాగబాబు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం లోక్‌సభా స్థానం నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఇక జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం అందరికి విదితమే.. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి పని చేస్తాయని ఇరు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories