సిట్ పై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ జరిపించాలి : విజయసాయిరెడ్డి

సిట్ పై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ జరిపించాలి : విజయసాయిరెడ్డి
x
Highlights

మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే.. అయితే ఈ హత్యను మంత్రి ఆదినారాయణరెడ్డే చేయించారని వైసీపీ ఎంపీ...

మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే.. అయితే ఈ హత్యను మంత్రి ఆదినారాయణరెడ్డే చేయించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. 1998 నుంచి రాజారెడ్డిని మొదలు పెట్టుకుని వివేకానందరెడ్డి వరకు వైయస్ ఫ్యామిలీని లేకుండా చేయాలనీ చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. అప్పట్లో రాజారెడ్డిని చంపిన వాళ్లకు టీడీపీ ఆశ్రయం ఇచ్చిందని అన్నారు. రాజకీయంగా బలపడిన చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా టీడీపీ హత్య చేయించిందని ఆరోపించారు.

వివేకానందరెడ్డి హత్య విషయంలో సిట్ విచారణపై నమ్మకం లేదని.. సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే వివేకా హత్యకు ప్లాన్ చేశారని అన్నారు. వివేకానందరెడ్డి వైసీపీ తరుపున జమ్మలమడుగు ఎన్నికల ఇంఛార్జిగా ఉన్నారని గుర్తుచేశారు. కాగా రేపు పులివెందులలో వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని.. శనివారం సాయంత్రం జగన్ హైదరాబాద్ కు వస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories