పేదోళ్లంటే వారికి చిన్నచూపు అందుకే వద్దంటున్నారు : ఎంపీ విజయసాయిరెడ్డి

పేదోళ్లంటే వారికి చిన్నచూపు అందుకే వద్దంటున్నారు : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

చంద్రబాబు ఇసుక దీక్షపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీజన్‌లో వచ్చిపోయే దోమ లాంటోడు...

చంద్రబాబు ఇసుక దీక్షపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీజన్‌లో వచ్చిపోయే దోమ లాంటోడు అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో

'ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరువు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదు.' అని ఎద్దేవా చేశారు. అలాగే

పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే... సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై 'దోమ'లకు కష్టకాలమే.' అంటూ వ్యాఖ్యానించారు.

ఇక దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన చింతమనేనికి, బలహీనవర్గాల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులెందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, పవన్లకు ఏం తేడా లేదని వీళ్లకు పేదోళ్లన్నా, నిమ్న వర్గాల వారన్నా చాలా చిన్న చూపని విమర్శించారు. ఎలక్షన్లలో చిత్తుగా ఓడించినందుకు పేదవారిపై ఇంకా కసి పెంచుకున్నారన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories