చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలపై సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలపై సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి ఆంధ్ర రాష్ట్రంలోని రెండు కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలు.. ఏపీకి పట్టిన పీడ అని ఎద్దేవా...

బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి ఆంధ్ర రాష్ట్రంలోని రెండు కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలు.. ఏపీకి పట్టిన పీడ అని ఎద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీల వైఖరి కారణంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీలో పరిపాలన గాడి తప్పిందన్నారు. రాష్ట్రంలో అంతా రివర్స్‌ నడుస్తోందని.. పోలవరం ఆలస్యం వల్ల రూ.వేలకోట్ల నష్టం వాటిల్లిందని జోస్యం చెప్పారు.

ఏపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన నడవడం జరగడం లేదని సుజనాచౌదరి మండిపడ్డారు. వైసీపీ నేతల వల్ల కియాలాంటి పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేనే లేదని మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్న సుజనా వైసీపీ నేతలు పిచ్చివేషాలు వేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories