స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదు - ఎంపీ సత్యనారాయణ
ఎంపీ సత్యనారాయణ (ఫైల్ ఇమేజ్)
ఎంతో కాలం లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సమస్య ఉంటే పరిష్కరించాలి తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు. సీఎం జగన్ విశాఖ ప్రజల ఆకాంక్షలను ప్రధానికి రాసిన లేఖలో తెలిపారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్పై ఆధారపడి అనేక మంది జీవిస్తున్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి అధ్యక్షతన కేంద్రం మంత్రులను కలుస్తామని వెల్లడించారు.
Next Story




