Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించనున్న సీబీఐ

Jyothi
Published on: 14 March 2023 9:17 AM IST
MP Avinash Reddy to Be investigated by CBI Today
X

Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించనున్నారు. జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు.. ఇప్పటికే తన విచారణపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. అవినాష్‌రెడ్డి విచారణ సమయంలో వీడియో, ఆడియో రికార్డు చేయనున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story