భర్త పట్టించుకోలేదని నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

భర్త పట్టించుకోలేదని నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
x
Highlights

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోలేదన్న కారణంతో నలుగురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నానికి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోలేదన్న కారణంతో నలుగురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్, కళావతి దంపతులు. వీరికి నలుగురు సంతానం. అయితే వెంకటేష్ కొంతకాలంగా పనులకు వెళ్లకుండా సోమరిలా తయారయ్యాడు. అంతకుముందే మద్యం అలవాటున్న వెంకటేష్ ఇటీవల దానికి తీవ్రంగా బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి పనులకు వెళ్ళేవాడు కాదు.

దాంతో ఇల్లు గడవడం కష్టమైంది.. దంపతుల మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భర్త తీరుతో విసుగు చెందిన కళావతి బ్రతకకూడదని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లల్ని పట్టించుకునేవారు ఉండరని భావించి.. తన నలుగురు పిల్లలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని గుర్తించిన స్థానికులు తల్లి కళావతి, పిల్లలు అంజలి, రమేష్, రాజశేఖర్, వైష్ణవిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త వెంకటేష్ కుటుంబాన్ని పట్టించుకోలేదన్న మనస్తాపంతోనే కళావతి ఈ పని చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories