నా గొంతుతో కావాలనే మిమిక్రీ చేశారు: ఉండవల్లి శ్రీదేవి
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. కావాలనే తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. కావాలనే తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఆరోపణలపై నిజనిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఆడియో టేప్ను డైలీ సీరియల్ లాగా ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు. తన గొంతుతో కావాలనే మిమిక్రీ చేసి ఆడియో టేప్ లతో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దళిత మహిళపై ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు.
Next Story




