సీఎం జగన్ తో సమావేశం అయిన ఎమ్మెల్యే రోజా

సీఎం జగన్ తో సమావేశం అయిన ఎమ్మెల్యే రోజా
x
Highlights

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీఐఐసి చైర్మన్, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా... భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన ఆమె......

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీఐఐసి చైర్మన్, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా... భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన ఆమె... సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రోజా తన ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎంను కలిసిన ఫోటోను కూడా షేర్ చేశారు.'ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నగరి నియోజకవర్గ సమస్యలను వివరించడం జరిగింది.' అని ఆమె పేర్కొన్నారు.

రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించినా జగన్ మాత్రం ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో రోజా కొంతకాలంగా ఆసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎంను రోజా సీఎంను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం రోజా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories