ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్, పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.

Sriveni Erugu
Published on: 4 Feb 2022 12:51 PM IST
MLA Balakrishna Maunadeeksha
X

ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకంటించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. తొలుత పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో బాలకృష్ణ మౌనదీక్షకు కూర్చున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story