ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుంది : ఎమ్మెల్యే అమర్ నాథ్

ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుంది : ఎమ్మెల్యే అమర్ నాథ్
x
Highlights

ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ భూములపై టీడీపీ...

ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ భూములపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. నిజనిర్ధారణ కమిటీని చంద్రబాబు మూడేళ్ళ క్రితమే వేయల్సిందని అన్నారు, హుద్ హుద్ తుఫాన్ లో భూముల రికార్డులు పోయాయని చెప్పిన టీడీపీ నాయకులు ఆనాడు నిజనిర్ధారణ కమిటీని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై రాద్ధాంతం చేస్తోందని, టీడీపీ హయంలో వేల ఎకరాలు కబ్జా అయిపోయాయని అన్నారు. చంద్రబాబుకు ఏ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదని, ఆయనకి మూడు గ్రామాల అభివృద్ధే కావాలని వాఖ్యానించారు. చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని అమర్ నాథ్ విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories