మంత్రి కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

మంత్రి కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి
x
మంత్రి వనిత కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి
Highlights

సంక్రాంతి పండగ వేళ పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వైసీపీ నేత, మంత్రి తానేటి వనిత తన కాన్వాయ్‌తో భీమడోలు రహదారిపై వెళ్తోంది. ఈ సమయంలో...

సంక్రాంతి పండగ వేళ పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వైసీపీ నేత, మంత్రి తానేటి వనిత తన కాన్వాయ్‌తో భీమడోలు రహదారిపై వెళ్తోంది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఆమె కాన్వాయ్‌‌లోని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు కూడా ఢీకొట్టి రహదారి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలతో బయటపడగా ద్విచక్రవాహనంపై ఉన్న వృద్ధుడు మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని భీవవరానికి చెందిన వెంకటరామయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories