భావోద్వేగానికి గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

భావోద్వేగానికి గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
x
Highlights

భావోద్వేగానికి గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావోద్వేగానికి గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నారమలి శివప్రసాద్(68) శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివదేహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు పెద్దిరెడ్డి. 'రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయనతో నాకు అవినాభావా సంబంధం ఉంది. శివప్రసాద్ విలక్షణ నటుడు, విలక్షణ రాజకీయ నాయకుడు. అన్ని రాజకీయ పార్టీలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. శివప్రసాద్ అకాల మరణం జిల్లాతోపాటు.. మా అందరికి తీరని లోటు.. ఆయన ఆత్మశాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేతను కోల్పోయాం' అని పెద్దిరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా తనతో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకుంటుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా శివప్రసాద్ అంత్యక్రియలు సోమవారం అగరాలలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories