బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షాపై నిప్పులు చెరిగారు. ...
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షాపై నిప్పులు చెరిగారు.
*'ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అభివృద్ధి కాదు. అవినీతి' - అమిత్ షా ఏ1తో స్నేహం చేస్తే..అంతా ఏ1 లాగే కనిపించడంలో తప్పులేదు. అంతేగా @AmitShah Ji ???
*రాయలసీమ పై కపట ప్రేమ వద్దు షా జీ
తరాలుగా కలగా మిగిలిన జలాలు వచ్చాయి. పొలాయి తడిశాయి.
కియా వచ్చింది. ఉద్యోగాలు తెచ్చింది.
పరిశ్రమలు వచ్చాయి. ఉపాధిని పెంచాయి.
రాయలేలిన సీమ..కోనసీమగా కనిపిస్తోంది.
*కేంద్రం కుదరదు అన్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం.
మీ డిక్లరేషన్ రాజకీయాలకు ప్రజలే సమాధానం చెప్పబోతున్నారు. వెయిట్ అండ్ సి షా జీ
*అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం..దీనికి కేంద్రం ఇచ్చిన అవార్డులే సాక్ష్యం.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్రామీణాభివృద్ధి లో ఏపీ నెంబర్ 1 అని మీరే అవార్డులు ఇచ్చారు.
*అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం-ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సర్వే
*అమిత్ షా పొరపడ్డారా? వారి పార్టీనేతలే తప్పుదారి పట్టించారా?
*తిత్లీ తుఫానుతో అల్లాడిపోయిన శ్రీకాకుళం జిల్లా వైపు చూడటానికి కూడా మనసు ఒప్పని బీజేపీ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా శ్రీకాకుళం జిల్లా వేదికగా కుట్ర రాజకీయం మొదలు పెట్టారు. ఏ మొహం పెట్టుకొని శ్రీకాకుళం జిల్లా లో @BJP4India నేతలు పర్యటిస్తారు?
*దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం అనే విషయం మర్చిపోయారా అమిత్ షా గారు.ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్ర హక్కుగా వచ్చిన నిధులు కాకుండా ఏపీకి ఏమి ఇచ్చారో మీరు చెప్పగలరా?
*అంటే మీరిచ్చిన నిధులు 6 శాతం మాత్రమే. రాష్ట్రం వెచ్చించిన నిధులు, భూములు విలువతో కలిపితే 94 శాతం ఇచ్చినట్టు. ఎవరు ఎక్కువిచ్చినట్టు షాజీ?
*వెనుక బడిన జిల్లాలకు ఇచ్చినట్టే ఇచ్చి మీరు వెనక్కి లాక్కున్న రూ. 350 కోట్లకు మరో రూ. 350 కోట్లు కలిపి ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసింది. కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. వెనకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం వచ్చారు.
*నీతి అయోగ్ ఇమ్మన్న రూ.700 కోట్లు గురించి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా మీకు?
*విభజన చట్టంలో కీలకమైన 14 అంశాల్లో 10 అంశాలను పూర్తి చేశామని అమిత్ షా అనడం హాస్యాస్పదం. 9 అంశాలను పూర్తిగా విస్మరించిన కేంద్రం, 5 అంశాలను సగానికి వదిలి పెట్టిన విషయంపై రాష్ట్రప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. పోలవరానికే ఇంకా రూ.3,722 కోట్లు ఇవ్వాల్సిన విషయం మర్చిపోయారా?
*పదకొండు విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.11,600 కోట్ల విలువైన 2,909 ఎకరాల భూమి ఇచ్చాం. రూ.131కోట్లతో ప్రహరీ గోడలు నిర్మించాం. ఇందులో మీ మోడీ గారు ఇచ్చింది ఎంతో తెలుసా షా గారు? రూ. 746 కోట్లు.
*బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించే ముందు రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1,16,000 కోట్లను ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ పై స్పష్టత ఇచ్చిన తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టాలి. లేదంటే అమిత్షా తన సభకు హాజరైన ఖాళీ కుర్చీలతో చెప్పిన గాలికబుర్లే చెప్పుకోవాల్సి వస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire