Visakhapatnam: నిబంధనలు పాటించండి: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Visakhapatnam: నిబంధనలు పాటించండి: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
x
Highlights

కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతివారూ తప్పక పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ప్రభుత్వ...

కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతివారూ తప్పక పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రకటించిన కరోనా సహాయం రూ.వెయ్యి వాలంటీర్లతో జీవీఎంసీ 5 వ వార్డులో అందజేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలందరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు.

అనంతరం వార్డు పరిధి పరదేశిపాలెం ప్రాంతంలో మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతరావు, వార్డు వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి పోతిన సంధ్య లావణ్య ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు


Show Full Article
Print Article
More On
Next Story
More Stories