ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. కరోనా వ్యాప్తి వెనుక టీడీపీ కుట్ర..

ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. కరోనా వ్యాప్తి వెనుక టీడీపీ కుట్ర..
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందన్నారు. కొత్త ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేనన్న అనుమానం వస్తోందని చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించిన కనగరాజ్‌ గవర్నర్ బంగ్లాకు వెళ్లడంతోనే కరోనా వచ్చిందనే ఆరోపణలను మంత్రి మోపిదేవి తప్పుబట్టారు చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతారంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ ప్రమాణ స్వీకారాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం వల్ల కరోనా పాజిటివ్ వచ్చిందని టీడీపీ ఆరోపిస్తోందని ఇది చిల్లర రాజకీయం అంటూ మండిపడ్డారు. బీజేపీ కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌కు లేఖ రాయడం రాజకీయమేనని తప్పుబట్టారు. కిట్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మోపిదేవి వెంకటరమణ తెలిపారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories