జగన్ ప్రకటనపై మంత్రి కొడాలి క్లారిటీ

జగన్ ప్రకటనపై మంత్రి కొడాలి క్లారిటీ
x
కొడాలి నాని
Highlights

అమరావతి రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దని మంత్రి కొడాలి నాని సూచించారు. రాజధాని కమిటీ నివేదిక ఇచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టంగా...

అమరావతి రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దని మంత్రి కొడాలి నాని సూచించారు. రాజధాని కమిటీ నివేదిక ఇచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి కొడాలి నాని‌.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌పై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఒక్కచోటే కాకుండా రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని దీనికి బాబు, పవన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా, రాజధాని కమిటీ నివేదిక ఇచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టంగా చెప్పారని మంత్రి గుర్తుచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories