పేపర్‌ లీక్‌ అని దరిద్రమైన ప్రచారం : మంత్రి అనిల్

పేపర్‌ లీక్‌ అని దరిద్రమైన ప్రచారం : మంత్రి అనిల్
x
Highlights

పేపర్‌ లీక్‌ అని దరిద్రమైన ప్రచారం : మంత్రి అనిల్ పేపర్‌ లీక్‌ అని దరిద్రమైన ప్రచారం : మంత్రి అనిల్

ఇటీవల నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన తమ పార్టీ అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి జీర్ణించుకోలేక పేపర్‌ లీక్‌ అంటూ దరిద్రమైన ప్రచారం మొదలుపెట్టడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి ధ్వజమెత్తారు. రికార్డు స్థాయిలో నిర్వహించిన ఈ ప్రక్రియ పట్ల అధికారులను అభినందించాల్సింది పోయి విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. పేపర్ లీక్ అయిందన్న ఆధారం లేకుండా ఊహాజనితంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories