పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడని మాజీ మావోయిస్టు హత్య

పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడని మాజీ మావోయిస్టు హత్య
x
Highlights

మరోసారి ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం

మరోసారి ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలు లంబయ్యను హతమార్చారు. లంబయ్యను గతరాత్రి సీసీఐ మావోయిస్టు హతమార్చింది. దీంతో ఏజన్సీలో మరోసారి అలజడి నెలకొంది. లంబయ్య గతంలోనే మావోయిస్టు పార్టీలో పనిచేసి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

అయితే అతను పోలీసులకు తమ సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నట్టు మావోలు అనుమానించారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై వెళుతున్న లంబయ్యను పట్టుకొని తుపాకీతో దారుణంగా కాల్చి హత్య చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకొని తీవ్రంగా రోధించారు. లంబయ్య హత్య నేపథ్యంలో భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories