Visakhapatnam: భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త

భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కూడా దాడి అత్త, కొడలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో భర్త అప్పారావు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Dec 2025 2:59 PM IST
Visakhapatnam: భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త
X

Visakhapatnam: భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త

భార్య, అత్తపై భర్త సుత్తితో దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. పెందుర్తి పరిధిలోని దగ్గువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అప్పారావు అనే వ్యక్తి తన భార్య లక్ష్మి, అత్త కనకమహాలక్ష్మిపై సుత్తితో దాడి చేశాడు.

బాధితుల అరుపులు విని అడ్డుకోవడానికి వచ్చిన స్థానికులపై కూడా అప్పారావు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కనకమహాలక్ష్మి, లక్ష్మిలను స్థానికులు వెంటనే పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భర్త అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story