ట్రైన్‌లోనే రాసలీలు సాగించిన ప్రేమజంట.. చుట్టూ జనాలు ఉన్నారన్న విషయాన్ని..

ట్రైన్‌లోనే రాసలీలు సాగించిన ప్రేమజంట.. చుట్టూ జనాలు ఉన్నారన్న విషయాన్ని..
x
ట్రైన్‌లోనే రాసలీలు సాగించిన ప్రేమజంట
Highlights

రోజులు మారాయి. నిన్న, మొన్నటి వరకు పార్కులకే పరిమితమైన భాగోతాలు మితిమీరి రైళ్లెక్కాయి. విశాఖ మీదుగా భువనేశ్వర్‌ వెళ‌్తున్న ఇంటర్ సిటీ రైలులో ఓ ప్రేమ...

రోజులు మారాయి. నిన్న, మొన్నటి వరకు పార్కులకే పరిమితమైన భాగోతాలు మితిమీరి రైళ్లెక్కాయి. విశాఖ మీదుగా భువనేశ్వర్‌ వెళ‌్తున్న ఇంటర్ సిటీ రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని సైతం మరిచి రాసలీలలు సాగించారు. ఇలాంటి పనులు చేయడం తప్పు అని చెప్పిన వారిపై దాడికి యత్నించారు. ఇదంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో జరిగింది.

ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ ప్రేమ జంట ఏకంగా రైలులో తమ ప్రేమలీలలు మొదలెట్టారు. చుట్టూ అందరూ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా ఇష్టరీతిన ప్రవర్తించారు. ఇది చూసిన తోటి ప్రయాణికులు తప్పని వారించారు. దీంతో ఆ ప్రేమికుడికి ఎక్కడా లేని కోపం ముంచుకొచ్చింది. అడ్డుచెప్పిన వారిపై దాడికి ప్రయత్నించాడు. ఘటనను చూసిన మిగతా వారు గట్టిగా మందలించి వదిలేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories