వాసిరెడ్డి పద్మను కలిసిన ప్రేమజంట

వాసిరెడ్డి పద్మను కలిసిన ప్రేమజంట
x
Highlights

కులాలు వేరైనా వారిద్దరి మనసులు కలిసాయి. దాంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అబ్బాయి తక్కువ కులానికి చెందిన...

కులాలు వేరైనా వారిద్దరి మనసులు కలిసాయి. దాంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అబ్బాయి తక్కువ కులానికి చెందిన వాడని అమ్మాయి కుటుంబసభ్యులు పెళ్ళికి నిరాకరించారు. దాంతో ప్రేమికులిద్దరు ఇంటినుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం వాళ్ళని ఇంట్లోకి రానియ్యలేదు.

దాంతో కర్నూలుకు చెందిన ప్రేమికులిద్దరు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు. వాళ్లకు ధైర్యం చెప్పారు వాసిరెడ్డి పద్మ. వాళ్ళిద్దరూ మేజర్లు కావడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. అయితే అబ్బాయి మీద కిడ్నాప్ కేసు నమోదయిందని అన్నారు. మహిళా కమిషన్ చొరవ తీసుకుని పోలీసులని రప్పించి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేసి.. తల్లిదండ్రులను మెప్పించమని చెప్పినట్టు వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories