ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం
x
Lorry Accident
Highlights

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు...

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట సమీపంలోని కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరుకు సిమెంట్‌ లారీ వెళుతోంది.

ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌, క్లీనర్‌ మంటలలో సజీవదహనమయ్యారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories