ఆగస్టు 15న 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో జెండా ఎగురవేసే మంత్రుల జాబితాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్...
ఆగస్టు 15న 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో జెండా ఎగురవేసే మంత్రుల జాబితాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా వందనం చేస్తారు. అదేవిధంగా శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి , విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ , తూర్పుగోదావరి జిల్లాలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ,నెల్లూరులో మంత్రి సుచరిత, కర్నూల్లో మంత్రి బొత్స సత్యనారాయణ , వైఎస్సార్ కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా , అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి జెండా వందనం సమర్పించనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire