ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా

ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా
x
Highlights

ఆగస్టు 15న 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో జెండా ఎగురవేసే మంత్రుల జాబితాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్...

ఆగస్టు 15న 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో జెండా ఎగురవేసే మంత్రుల జాబితాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా వందనం చేస్తారు. అదేవిధంగా శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయనగరంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి , విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ , తూర్పుగోదావరి జిల్లాలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ,నెల్లూరులో మంత్రి సుచరిత, కర్నూల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ , వైఎస్సార్ కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా , అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి జెండా వందనం సమర్పించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories