జగన్ రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు : లక్ష్మీనారాయణ

జగన్ రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు : లక్ష్మీనారాయణ
x
Highlights

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జగన్ పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు రాజకీయాల కోసం చేసిన ఆరోపణలేనని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అది రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు. అంతేకాదు తమకు వచ్చిన ఎవిడెన్స్‌ ఆధారాల మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చామని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని లక్ష్మీనారాయణ అన్నారు. కాగా జగన లక్షకోట్లు దోచుకున్నాడని టీడీపీ, జనసేనలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జనసేన నుంచే లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీ బరిలో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories