కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన కేవీపీ రామచంద్రరావు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన కేవీపీ రామచంద్రరావు
x
Highlights

కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంకును కార్పొరేషన్ బ్యాంకుతో కలిసి యూనియన్ బ్యాంకులో విలీనం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే....

కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంకును కార్పొరేషన్ బ్యాంకుతో కలిసి యూనియన్ బ్యాంకులో విలీనం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ఎంపీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

ఆంధ్రా బ్యాంకును విలీనం చేయొద్దని, ఆంధ్రా బ్యాంకు అనే పేరు మార్చొద్దని, ఇది తెలుగు వాళ్ల సెంటిమెంటుతో ముడిపడిన అంశమని KVP తన లేఖలో స్పష్టం చేశారు. ఒకవేళ విలీనం తప్పనిసరైనా, పేరు మాత్రం పాతదే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగువాళ్ల సెంటిమెంట్‌ను కేంద్రం గౌరవించాలని కేవీపీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories