Kurnool Farmer Diamond Found: కర్నూలు రైతుకు లభించిన విలువైన వజ్రం..వ్యాపారులకు షాకిచ్చాడు, ధర ఎంతో తెలుసా!

Kurnool Farmer Diamond Found
x

Kurnool Farmer Diamond Found: కర్నూలు రైతుకు లభించిన విలువైన వజ్రం..వ్యాపారులకు షాకిచ్చాడు, ధర ఎంతో తెలుసా!

Highlights

Kurnool Farmer Diamond Found: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వజ్రాల వేట మళ్లీ జోరుగా సాగుతోంది. వర్షాల కారణంగా భూమి పొరలు తొలగిపోతుండటంతో ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.

Kurnool Farmer Diamond Found: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వజ్రాల వేట మళ్లీ జోరుగా సాగుతోంది. వర్షాల కారణంగా భూమి పొరలు తొలగిపోతుండటంతో ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల కోసం వచ్చిన సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ రైతు పొలంలో విలువైన వజ్రం లభించిందని సమాచారం. విషయం తెలిసిన వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగారు. వజ్రాన్ని రూ.8 లక్షలకు కొనుగోలు చేయాలని రైతుతో బేరం పెట్టారు. కానీ రైతు షాకిచ్చే విధంగా దాని ధర రూ.18 లక్షలు అని డిమాండ్ చేశాడు. దీంతో వ్యాపారులకు ఆశ్చర్యం కలిగింది. ఈ బేరం ఇంకా ఖరారు కాలేదని సమాచారం.

ఇదే సమయంలో వ్యాపారులు ఒక సమూహంగా ఏర్పడి, తక్కువ ధరకు వజ్రాలు కొనుగోలు చేయడానికి సిండికేట్ వ్యవస్థను నడుపుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తమపై ఒత్తిడి పెడుతున్నారని, తక్కువ ధరకు వజ్రాలు అమ్మాలని కోరుతున్నారని స్థానిక కూలీలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరహాలో గత మూడు వారాల క్రితం తుగ్గలి మండలం పెండేగల్లులో ఓ మహిళా కూలీకి 15 క్యారెట్ల వజ్రం దొరికిన సంగతి తెలిసిందే. అలాగే మే నెలలో పెరవలిలో ఓ వ్యక్తికి రూ.30 లక్షల విలువైన వజ్రం దొరకగా, ఓ వ్యాపారి దాన్ని కొనుగోలు చేశాడు. మరో ఘటనలో ఒక రైతు పొలంలో దొరికిన వజ్రాన్ని రూ.లక్షన్నరకి విక్రయించారు.

కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురం జిల్లా వజ్రకరూరులోనూ వర్షాల అనంతరం వజ్రాల వేట సాగుతోంది. అక్కడి ప్రజలు వాన పడగానే కుటుంబ సమేతంగా పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. వర్షం వల్ల భూమిలో ఉన్న వజ్రాలు బయటపడతాయని వారి నమ్మకం.

అయితే ఈ వేట వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. తమ పంటపొలాల్లోకి అక్రమంగా ప్రవేశించి వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పంట నష్టపోతోందని ఆరోపిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రైతులు "ఇక్కడ వజ్రాల కోసం వెతకవద్దు" అనే బోర్డులు కూడా పెట్టడం గమనార్హం.

మొత్తంగా చెప్పాలంటే, వర్షాలొచ్చిన ప్రతిసారి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల వేటకు ఉత్సాహం పెరుగుతోంది. కానీ దీనివల్ల రైతుల పంటలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో సమగ్ర కార్యాచరణ చేపట్టాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories