టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి కీలక నేత..

టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి కీలక నేత..
x
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత , కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు వైసీపీలో చేరనున్నారు. ఇటీవల...

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత , కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు వైసీపీలో చేరనున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఆయన కార్యకర్తలు, అనుచరులు, కుటుంబీకులతో చర్చించిన అనంతరం వైసీపీ తీర్థం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో కొత్తపల్లి వైసీపీ కండువా కప్పుకుని అవకాశం కనిపిస్తోంది. కాగా టీడీపీలో నరసరాపురం టిక్కెట్ ఆశించిన కొత్తపల్లికి నిరాశ ఎదురైంది.

ఆ సీటును మరొకరికి కేటాయించారు చంద్రబాబు. వాస్తవంగా 2014 ఎన్నికలకు ముందే కొత్తపల్లి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత జగన్ తో విభేదించిన ఆయన టీడీపీలో చేరారు. ఆయనకు టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది. అయితే ఎన్నికల సందర్బంగా నరసాపురం టిక్కెట్ ఆశించారు కానీ చంద్రబాబు మోడిచెయ్యి చూపడంతో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories