కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకకు పాణ్యం ఎమ్మెల్యే..

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకకు పాణ్యం ఎమ్మెల్యే..
x
Highlights

దశాబ్దల రాజకీయ చరిత్ర కలిగిన కోట్ల కుటుంబం టీడీపీలో చేరడం ఖాయమైంది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి...

దశాబ్దల రాజకీయ చరిత్ర కలిగిన కోట్ల కుటుంబం టీడీపీలో చేరడం ఖాయమైంది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయనకు కర్నూల్ ఎంపీ టికెట్, అలాగే ఆయన భార్య సుజాతమ్మకి డోన్ ఎమ్మెల్యే టికెట్, కుమారుడు రాఘవేందర్ రెడ్డికి కర్నూల్ మేయర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు కర్నూల్ ఎంపీగా ఉన్న బుట్టా రేణుకకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. కోట్ల రాకను వ్యతిరేకించిన కేఈ కుటుంబాన్నిఇప్పటికే బుజ్జగించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాగా కోట్ల చేరికతో కర్నూల్ లో టీడీపీ కి కలిసిరానున్న ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories