వైసీపీకి రాజీనామా చేసిన కీలక మహిళా నేత

వైసీపీకి రాజీనామా చేసిన కీలక మహిళా నేత
x
Highlights

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ వైసిపికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్నటికి మొన్న వంగవీటి రాధాకృష్ణ జగన్ పై సంచలన ఆరోపణలు...

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ వైసిపికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్నటికి మొన్న వంగవీటి రాధాకృష్ణ జగన్ పై సంచలన ఆరోపణలు చేసి వైసిపికి రాజీనామా చేస్తే, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సైతం జగన్మోహన్ రెడ్డి పై మండి పడి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొల్లి నిర్మల కుమారి.

ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సమయంలో ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నిర్మలా కుమారి నిన్న వైసీపీతో తనకున్న 8 ఏళ్ల బంధాన్ని వదులుకున్నారు. ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories