Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ ర్యాలీ తర్వాత కొత్త వివరాలు బయటకి వచ్చాయి


Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ ర్యాలీ తర్వాత కొత్త వివరాలు బయటకి వచ్చాయి
తమిళనాడు కరూర్లో టీవీకే (తమిళ వెట్రి కళగం) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలన వివరాలు బయటకు వస్తున్నాయి.
తమిళనాడు కరూర్లో టీవీకే (తమిళ వెట్రి కళగం) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలన వివరాలు బయటకు వస్తున్నాయి. శనివారం జరిగిన ర్యాలీ సమయంలో పట్ల విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయబడ్డదని టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. కాగా, విద్యుత్తు బోర్డు అధినేత చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ఈ లేఖను ధ్రువీకరించారు.
టీవీకే పార్టీ నేతలు తమకు ఇచ్చిన లేఖ మేరకు తాత్కాలికంగా విద్యుత్ నిలిపివేయాలని ఆదేశించారని బోర్డు చీఫ్ ఇంజినీర్ తెలిపారు. అయితే, విద్యుత్తు బోర్డు అధికారులు స్వయంగా సరఫరా నిలిపివేశారని, రాజకీయ ప్రేరణతో పనిచేయలేదని బోర్డు చెబుతోంది. ఈ పవర్ కట్ కారణంగానే కరూర్లో జరిగిన భారీ తొక్కిసలాటమని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ ఘట్టంలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించగా, 80 మంది పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
పోలీసులు ఈ ఘటనకు సంబంధించి టీవీకే నాయకులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు, హీరో విజయ్ను కూడా అరెస్ట్ చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి. చెన్నైని చెందిన నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టారంటూ ఆదివారం రాత్రి డీజీపీ ఆఫీసుకు ఓ ఇ–మెయిల్ అందింది. తనిఖీల్లో ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. ఘటన తర్వాత, విజయ్ నివాసం వద్ద భద్రత కఠినతరం చేయబడింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



