నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి కారెం శివాజీ!

నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి కారెం శివాజీ!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత కారెం శివాజీ, నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు...

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత కారెం శివాజీ, నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఓ కార్యక్రమంలో శివాజీతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు వైసీపీలో చేరనున్నారు. వీరందరికీ సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. కాగా, కారెం శివాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి గురువారం రాజీనామా చేశారు.

రాజినామా లేఖను సీఎం జగన్ తో పాటు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి పంపారు. పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. కాగా 2016 లో టీడీపీలో చేరిన శివాజీకి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. అయితే ఆయన గడిచిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ టిక్కెట్ ఆశించినట్టు ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఆయున వైసీపీలో చేరాతరాని భావించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories