ఏపీలో 175 సీట్లు సాధిస్తాం : కేఏ పాల్

ఏపీలో 175 సీట్లు సాధిస్తాం : కేఏ పాల్
x
Highlights

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని...

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న లక్ష కోట్లు ఇస్తే... ఏపీ కష్టాలు తీరతాయని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జగన్‌ తనతో చర్చకు రావాలని అన్నారు. 2009 లోనే తాను రాజకీయం రంగ ప్రవేశం చేశానని.. కొత్తగా మొదలు పెట్టలేదన్నారు. అలాగే ఏపీలో ప్రజాశాంతి పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసినా ఆశ్చర్యంపోనక్కర్లేదన్నారు. ఎన్నికలకు మరో 90 రోజులు సమయం ఉందని.. ఇప్పటికే 100 సీట్లలో తమకు గెలుపు ఖాయమైందన్నారు. గట్టిగా కృషి చేస్తే.. 175కి ఏపీలో 175 సీట్లు సాధిస్తామని కూడా చెప్పారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన శిష్యుడని, మిత్రుడని కేఏ పాల్ సరదాగా వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories