Andhra Pradesh: అరుదైన జాతీయ రికార్డును సొంతం చేసుకున్నజ్యోతి సురేఖ

Jyoti Surekha own the rare national record
x

జ్యోతి సురేఖ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: 720కి గాను 710 పాయింట్లు స్కోర్‌ చేసి నూతన అధ్యయనానికి తెర

Andhra Pradesh: తెలుగు తేజం, ఇంటర్నేషనల్‌ ఆర్చర్‌ వెన్న జ్యోతి సురేఖ తాజాగా అరుదైన జాతీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్‌లో జరగనున్న ఆర్చరీ వరల్డ్‌ కప్‌ కోసం నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. హర్యానాలోని సోనేపట్‌లో మార్చి 2న జరిగిన ఈ ట్రయల్స్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో సురేఖ 720కి గాను 710 పాయింట్లు స్కోర్‌ చేసి నూతన అధ్యయనానికి తెర తీసింది. ఈ అరుదైన ఘనత సాధించిన జ్యోతి జాతీయ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే గతేడాది తన పేరిటే ఉన్న 709/720 రికార్డును తానే తిరగరాసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సెలెక్షన్స్‌ టోర్నీ మార్చి 2న పూర్తయింది

Show Full Article
Print Article
Next Story
More Stories