చంద్రబాబును కలిసిన సినీ నటి జయసుధ

చంద్రబాబును కలిసిన సినీ నటి జయసుధ
x
Highlights

సీనియర్ నటి, వైసీపీ మహిళా నేత జయసుధ చంద్రబాబుని కలిశారు. తన కుమారుడు వివాహానికి తప్పక రావాల్సిందిగా చంద్రబాబును ఆమె కోరారు.

సీనియర్ నటి, వైసీపీ మహిళా నేత జయసుధ చంద్రబాబుని కలిశారు. తన కుమారుడు వివాహానికి తప్పక రావాల్సిందిగా చంద్రబాబును ఆమె కోరారు. ఇందులో జయసుధ చెల్లలు సుభాషిణి కూడా ఉన్నారు. జ‌య‌సుధ‌కు ఇద్ద‌రు కొడుకులు నిహార్ క‌పూర్‌, శ్రియాన్ క‌పూర్‌. వీరిలో నిహార్ క‌పూర్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అమ్రిత్ కౌర్‌ను ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి చేసుకోనున్నారు. దీనితో ఆమె చంద్రబాబుని కలిసి ఆహ్వానించారు. ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో చనిపోయన సంగతి తెలిసిందే..

జయసుధ రాజకీయాల్లోకి వచ్చాక 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక అందులో చేరారు. ఇక గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories