ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఎదురుదెబ్బ

ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఎదురుదెబ్బ
x
Highlights

ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ప్రజారాజ్యం పార్టీనుంచి పోటీచేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ జనసేనకు రాజీనామా...

ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ప్రజారాజ్యం పార్టీనుంచి పోటీచేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌ బాయ్‌కి నేను మాజీ ఎమ్మెల్యేని అని తెలవదు.. నాతో జనసేన పార్టీకి అవసరం లేదని భావిస్తున్నాని.. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కని కారణంగానే జనసేనకు రాజీనామాచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

అలాగే తన కార్యకర్తలతో సంప్రదించి రెండు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఆయనను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ, టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ఆయనను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి గాంధీకి పలుమార్లు ఫోన్లు వస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. కాగా ఆయన టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. శనివారం లేదా ఆదివారం ఆయన టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories